హైదరాబాద్, జూన్ 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో జాతీయ రహదారులపై కేంద్రం సమీక్షించింది. హైదరాబాద్ వచ్చిన కేంద్ర రోడ్డు రవాణాశాఖ కార్యదర్శి గిరిధర్.. సోమవారం రాష్ట్ర ఆర్అండ్బీ అధికారులతో భేటీ అయ్యారు. ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగం నిర్మాణానికి అనుమతికి విజ్ఞప్తి చేసినందున ఆ ప్రాంతంలో ట్రాఫిక్ ఎలా ఉంటుంది? వంటి అంశాలపై వివరాలు అడిగి తెలుసుకొన్నారు. సోమశిల బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించిన అంశాలపై, ఇతర జాతీయ రహదారుల నిర్మాణాల పనితీరుపై చర్చించారు.