గద్వాల, మే 9 : జోగుళాంబ గద్వాల మున్సిపల్ బీఆర్ఎస్కు చెందిన 10 మంది కౌన్సిలర్లపై కేసులు నమోదయ్యాయి. కోఆప్షన్ ఎన్నికలను నిబంధనల ప్రకారం నిర్వహించాలని కోరినందుకు మున్సిపల్ కమిషనర్, సిబ్బంది సహకారంతో అధికార పార్టీ నేతల ఆదేశంతో బీఆర్ఎస్ కౌన్సిలర్లపై కేసులు నమోదు చేయించారు. కౌన్సిలర్లు వెంకటేశ్, జగదీశ్, గోపాల్, మోహన్ యాదవ్, సంటెన్న, చిన్నరాముడు, నరసింహ, సునీత, మంజులరాణి, లతతోపాటు బీఆర్ఎస్ నాయకులు చిత్తారి కిరణ్పై పట్టణ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు కాగా.. స్టేషన్ బెయిల్ ఇచ్చినట్టు తెలిసింది. మున్సిపల్ కమిషనర్ ఏకపక్షంగా వ్యవహరిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఆరోపించారు. శనివారం పట్టణ పోలీస్ స్టేషన్ ముందు అక్రమ కేసులు నమోదు చేయడంపై నిరసన వ్యక్తం చేశారు.