ఎల్బీనగర్, జూలై 20: ముఖ్యమంత్రి కేసీఆర్పై అనుచిత వాఖ్యలు చేసిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్పై సరూర్నగర్ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఈ నెల 13న నిర్వహించిన మీడియా సమావేశంలో అరవింద్.. తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ ప్రతిష్ఠను కించపరిచే విధంగా పరుష పదజాలంతో చేసిన వ్యాఖ్యలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని న్యాయవాది రవికుమార్ సరూర్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించి, ఎంపీ అరవింద్పై 504, 505(1)సీ ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు సీఐ సీతారాం తెలిపారు.