మేడ్చల్, ఆగస్టు 8: పరీక్ష కేంద్రం నుంచి పారిపోయిన అభ్యర్థిపై మేడ్చల్ పోలీసులు కేసు నమోదు చేశారు. టీఎస్పీఎస్సీ మున్సిపల్ శాఖలో అకౌంటెంట్ పోస్టుల భర్తీకి మంగళవారం ఆన్లైన్లో పరీక్ష జరిగింది. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ కండ్లకోయలోని సీఎంఆర్ సెట్ కేంద్రంలో పరీక్ష రాసేందుకు ఆదిలాబాద్కు చెందిన మహ్మద్ అసర్ హాజరయ్యాడు. పరీక్షా కేంద్రం నుంచి సాయంత్రం 4.15కు టాయిలెట్ కోసం అనుమతితో వెళ్లి తిరిగి రా కపోవడంతో పారిపోయినట్టు గుర్తించారు. అసర్పై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. కాగా, అకౌంట్స్ ఆఫీసర్, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్, సీనియర్ అకౌంటెంట్ ఉద్యోగ పరీక్షకు 46.30% మంది హాజరయ్యారు.