సూర్యాపేట : సూర్యాపేట నియోజకవర్గంలో మంత్రి జగదీష్ రెడ్డి(Minister Jagdish Reddy)కి వివిధ వర్గాల నుంచి మద్దతు వెల్లువలా కొనసాగుతున్నాయి. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ వైపే మా పయనం అంటూ వృత్తి, కుల సంఘాలు ఒకొక్కరుగా మంత్రికి మద్దతు తెలుపుతున్నారు. తాజాగా సూర్యాపేట కార్పెంటర్స్ అసోసియేషన్ నూతన కమిటీని ఎన్నుకొని కమిటీ సభ్యులు మంత్రిని కలిసి తమ మద్దతును ప్రకటించారు.
సూర్యాపేటలో జరిగిన అభివృద్ధితో తమకు చేతినిండా పని దొరుకుతుందని, మంత్రి జగదీష్ రెడ్డి సూర్యాపేట ప్రజలకు శ్రీరామరక్ష అని అన్నారు. సూర్యాపేట ప్రజలంతా మంత్రి జగదీష్ రెడ్డికి మద్దతుగా ఏకతాటిపై నిలిచి జరుగుతున్న అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.
కాగా, నూతన అధ్యక్షుడుగా బైరోజు లింగాచారి, కార్యదర్శిగా, కట్టోజు గోపి, ఉపాధ్యక్షుడిగా పర్వతం భుషణాచారి, సహాయ కార్యదర్శిగా బహురోజు ఉపేందర్ ఎన్నిక అవగా వారందరికీ మంత్రి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పుట్ట కిశోర్, కాసోజు మాధనాచారి, కురెళ్లి మనోహర్, కేషవరపు కిరణ్, పోతుగంటి వీరాచారి, జనగాం వీరాచారి, మోత్కురి వినోద్ పాల్గొన్నారు.