శంషాబాద్ రూరల్, జనవరి 13: ఒకటి వెనుక ఒకటి ఢీకొనడంతో కారు, ఆటో, బైక్ నిర్మాణంలో ఉన్న ఓ కల్వర్టులో బోల్తాపడ్డాయి. ఈ ఘటన శనివారం శంషాబాద్ రూరల్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. హైదరాబాద్- బెంగళూరు జాతీయ రహదారిలో శంషాబాద్ మండలంలోని ఘాన్సిమియాగూడ గ్రామసమీపంలో కల్వర్టు పనులు కొనసాగుతున్నాయి.
సంక్రాంతి పండు కోసం నగరంలో ఉన్న వారు సొంతూర్ల వెళ్తున్నారు. ఘాన్సిమియాగూడ గ్రామ సమీపంలోకి రాగానే అతివేగంగా వచ్చిన కారు అదుపుతప్పి బైక్ను ఢీకొనడంతో బైక్ ముందుగా వెళ్తున్న ఆటోను ఢీకొంది. దీంతో ఈ మూడు వాహనాలు రోడ్డు పక్కనే ఉన్న కల్వర్టు గుంతలో పడిపోయాయి. ఈ ప్రమాదంలో కారులో ఉన్న మేరువ ఆదిశేషారెడ్డి (57), ఆయన తల్లి రాములమ్మ (88) మరణించారు. కాగా బైక్పై ఉన్న సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ అంజి, అతడితోపాటు అక్షిత అనే బాలికకు గాయాలయ్యాయి. ఆటో డ్రైవర్తోపాటు అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు కార్మికులకు గాయాలయ్యాయి.