రంగారెడ్డి : నార్సింగి పోలీస్స్టేషన్ పరిధిలోని నడుస్తున్న స్కోడా కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఎంజీఐటీ కాలేజీ వద్ద ఈ ఘటన జరిగింది. ఒక్కసారిగా కారులో నుంచి పొగలు, మంటలు రావడంతో గమనించి కారులో ఉన్న వారంతా ముందు జాగ్రత్తగా దిగి బయటకు వచ్చారు. తర్వాత మంటలు కారంతా వ్యాపించడంతో కారు పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా.. సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. అయితే, మంటలు చెలరేగడానికి కారణాలు మాత్రం తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.