హైదరాబాద్ : బేగంపేట ఎయిర్ఫోర్స్ స్టేషన్ స్టేషన్ కమాండర్గా గ్రూప్ కెప్టెన్ మనీశ్ కుమార్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఎయిర్ కమాండర్ సునీల్ తోమర్.. మనీశ్ కుమార్కు బాధ్యతలు అప్పగించారు. భారత వాయుసేనలో ఫ్లయింగ్ (నేవిగేటర్) బ్రాంచ్లో 1996 జూన్లో మనీశ్కుమార్ గ్రూప్ కెప్టెన్గా చేరారు. నేవిగేషన్ ఇన్స్ట్రక్టర్గా, అత్యంత ప్రతిభ ఉన్న అధికారిగా ఆయన పేరు పొందారు. సౌత్ వెస్ట్రన్ ఎయిర్ కమాండ్ హెడ్క్వార్టర్స్ ఆధ్వర్యంలో గైడెడ్ వెఫ్ స్టేషన్కు మనీశ్ కుమార్ కమాండెడ్గా పనిచేశారు. ఎయిర్ క్రూ ఎగ్జామినేషన్ బోర్డు డైరెక్టర్గా ఆయనకు సుదీర్ఘ అనుభవం ఉన్నది.