హైదరాబాద్: రాష్ట్రంలో పోడుభూముల సమస్యలపై మంత్రివర్గ ఉపసంఘం సమావేశం సమావేశమయింది. మంత్రి సత్యవతి రాథోడ్ అధ్యక్షతన బీఆర్కే భవన్లో జరుగుతున్న ఈ సమావేశానికి మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, జగదీశ్ రెడ్డి, పువ్వాడ అజయ్ హాజరయ్యారు. మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటైన తర్వాత సమావేశమవడం ఇదే మొదటిసారి.
ఈనెల 16న జరిగిన మంత్రి మండలి సమావేశంలో పోడు భూముల సమస్యలపై పూర్తి అవగాహన, పరిష్కారాల అన్వేషణ, సూచనల కోసం సీఎం కేసీఆర్ కేబినెట్ సబ్ కమిటీని నియమించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు మంత్రివర్గ ఉపసంఘం సమావేశమయింది.