హైదరాబాద్ : తెలంగాణలో కొత్తగా 7 వైద్య కళాశాలల ఏర్పాటుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. ఆదివారం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు ఆమోదం లభించింది. మహబూబాబాద్, సంగారెడ్డి, జగిత్యాల, నాగర్కర్నూల్, వనపర్తి, కొత్తగూడెం, మంచిర్యాల జిల్లాల్లో కొత్తగా ఈ కళాశాలలు ఏర్పాటు కానున్నాయి. వైద్య కళాశాలల ఏర్పాటుతో ప్రజలకు స్థానికంగా మెరుగైన వైద్య సేవలు అందనున్నాయి. గతంలోనే సీఎం కేసీఆర్ మహబూబాబాద్, జగిత్యాల జిల్లాలకు వైద్య కళాశాలలు కేటాయిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆయన హామీని నిలబెట్టుకున్నారు. వైద్య కళాశాలల కేటాయింపుపై ఆయా జిల్లాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.