హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ): అనారోగ్యంతో అపోలో దవాఖానలో చేరి చికిత్స పొందిన ఎమ్మెల్సీ వాణీదేవి బుధవారం డిశ్చార్జ్ అయ్యారు. వారంక్రితం గుండె సంబంధిత సమస్యలతో దవాఖానలో చేరిన ఆమెకు డాక్టర్లు బైపాస్ సర్జరీ చేశారు. శస్త్రచికిత్స అనంతరం కోలుకున్న ఆమె బుధవారం దవాఖాన నుంచి డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని కుటుంబసభ్యులు తెలిపారు.