Narsapur | మెదక్ : నర్సాపూర్లో నిర్వహించిన సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలో బుల్లెట్లు కలకలం సృష్టించాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం సాయంత్రం కేసీఆర్ నర్సాపూర్ సభలో పాల్గొన్నారు. ఈ సభలో ఒక్కసారిగా బుల్లెట్లు బయటపడ్డాయి.
కేసీఆర్ సభలో ప్రసంగిస్తుండగా అస్లాం అనే యువకుడు అనుమానాస్పందంగా తిరుగుతుండడంతో పోలీసులు ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. అస్లాం నుంచి రెండు బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అస్లాం సంగారెడ్డి జిల్లా రాయికోడ్కి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. పోలీసులు అస్లాంను విచారిస్తున్నారు.