జఫర్గఢ్, డిసెంబర్ 29: జనగామ జిల్లా జఫర్గఢ్లో కొత్త రాతి యుగం నాటి గుర్తులు, బౌద్ధ స్తూపం, జైన దేవాలయం ఆధారాలున్నాయని చరిత్ర పరిశోధకుడు రెడ్డి రత్నాకర్రెడ్డి తెలిపారు. అందుకు సంబంధించిన ఆనవాళ్లు లభించాయని ఆయన పేర్కొన్నారు. జఫర్గఢ్కు పడమటి వైపు ఉన్న మాల్చగుట్టకు మూడు వైపులా గ్రామ పెద్ద చెరువు ఉన్నది. గుట్ట దిగువన చెరువు వైపు ఎత్తయిన ఇటుక నిర్మాణం ఉన్నది. ఇటుక ముక్కలతో ప్రాంతమంతా ఎత్తయిన దిబ్బలా ఉన్నది.
బౌద్ధ శిల్పాలకు ఉపయోగించే పాలరాతికి చెందిన అనేక చిన్న పెచ్చులు లభించాయని, పాలరాయిని దిగుమతి చేసుకొని స్థానిక గుట్టపైనే శిల్పాలు చెక్కినట్టు తెలుస్తున్నదని రెడ్డి రత్నాకర్రెడ్డి తెలిపారు. జఫర్గఢ్లోని మాల్చ గుట్ట బౌద్ధ స్తూపం జగిత్యాల జిల్లాలోని మునుల గుట్టకు రెండో వైపు ఉన్న శిథిల బౌద్ధ స్తూప పరిసరాలను తలపిస్తున్నట్టు తెలిపారు. గుట్ట దిగువన సప్త మాతృకలలో భాగంగా కనిపించే వారాహి శిల్పం విడిగా ఉండటం విశేషమని, శిల్పం పొట్ట నుంచి దిగువ భాగం వరకే ఉన్నదని ఆయన పేర్కొన్నారు.