Engineering courses | హైదరాబాద్, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ) : ఎమర్జింగ్ కోర్సులను ప్రవేశపెట్టడం, సీఎస్ఈ కోర్సుల్లో సీట్లను పెంచడం, కొత్త బ్రాంచిలకు అనుమతులివ్వడంతో గత కొంతకాలంగా ఇంజినీరింగ్ విద్య పునర్వైభవాన్ని సంతరించుకొంటున్నది. దీంతో ఏటేటా రాష్ట్రంలో బీటెక్ ప్రవేశాలు పెరుగుతున్నాయి. అంతేగాక, కొత్త పెట్టుబడులు రావడం, కంపెనీలు ఏర్పాటవుతుండటం, ఉద్యో గ, ఉపాధి అవకాశాలు పెరగడం. క్యాంపస్ ప్లేస్మెంట్లలో మంచి ప్యాకేజీలుండటం వల్ల ఇప్పుడు విద్యార్థులంతా బీటెక్ చదివేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇందుకు రాష్ట్రంలో ఇంజినీరింగ్ అడ్మిషన్లు పెరగడమే నిదర్శనంగా నిలుస్తున్నది.
బీటెక్ ఫస్టియర్ అడ్మిషన్లు గణనీయంగా పెరుగుతున్నాయి. ఐదేండ్లలో 24,555 అడ్మిషన్లు పెరిగాయంటే ఈ కోర్సులకున్న డిమాండ్ను అర్థం చేసుకోవచ్చు. 2019తో పోల్చితే 2023లో మొత్తం 35 శాతం అడ్మిషన్లు పెరగడం విశేషం. మన కాలేజీల్లో ఎమర్జింగ్ కోర్సులను, ఉద్యోగావకాశాలున్న కోర్సులను ప్రవేశపెడుతున్నారు. మైనర్, మేజర్ డిగ్రీకోర్సుల వంటి సంస్కరణలను అమలు చేస్తున్నారు. ఫలితంగా ఇంజినీరింగ్ కోర్సులకు డి మాండ్ పెరుగుతున్నది. ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగంలో మాంద్యం ప్రభావం ఉన్నా, మన విద్యార్థులు ఐటీ కొలువులే లక్ష్యంగా బీటెక్ కోర్సుల్లోనే చేరుతుండటం కొత్త ట్రెండ్ను సృష్టిస్తున్నది.
త్వరగా స్థిరపడే అవకాశం
ఇంజినీరింగ్ పూర్తికాగానే మంచి ఉద్యోగా లు లభిస్తున్నాయి. ఇంజినీరింగ్ విద్య పూర్తిచేస్తే జీవితంలో స్థిరపడే అవకాశాలుంటాయి. క్యాంపస్ ప్లేస్మెంట్స్తో ఐటీ కం పెనీలు మంచి ఆఫర్లిస్తున్నాయి. విద్యార్థు లు, వారి తల్లిదండ్రులు బీటెక్ వైపే చూస్తు న్నారు. సీఎస్ఈ కోర్సులో మన దగ్గరే అధికంగా సీట్లున్నాయి. ఎమర్జింగ్ కోర్సులను క్రమంగా ప్రవేశపెడుతున్నాం.
– ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్, ఓయూ ఇంజినీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్