హైదరాబాద్, జూన్ 9 (నమస్తే తెలంగాణ): డిగ్రీ కోర్సుల్లో మూస చదువులు, మూస పరీక్షల విధానానికి ముగింపు పలి కే దిశగా ఉన్నత విద్యామండలి కీలక నిర్ణయం తీసుకున్నది. ఆవిష్కరణలను విస్తృతంగా ప్రోత్సహించాలని, డిగ్రీలో నిరంతర మూల్యాంకనాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. మూల్యాంకన విధానంలోనూ సమూల మార్పులు తీసుకురానున్నారు. శుక్రవారం మాసబ్ట్యాంక్లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో రాష్ట్రంలోని ఏడు యూనివర్సిటీల వీసీలతో సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, కళాశాల విద్యాశాఖ కమిషనర్ నవీన్మిట్టల్, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లిం బాద్రి, వైస్ చైర్మన్ ప్రొఫెసర్ వెంకటరమణ, కార్యదర్శి డాక్టర్ ఎన్ శ్రీనివాస్రావు, వీసీలు డీ రవీందర్యాదవ్, తాటికొండ రమేశ్, గోపాల్రెడ్డి, ఎస్ మల్లేశ్, డీ రవీందర్, విద్యుల్లత, ఇం డియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) ప్రతినిధులు డాక్టర్ చంద్రశేఖర్ శ్రీపాద, గరిమ మాలిక్ తదితరులు పాల్గొన్నారు. మూల్యాంకన విధానంపై ఐఎస్బీ సమర్పించిన నివేదికపై చర్చించారు.