హైదరాబాద్, జనవరి 29 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ను ప్రజలు గెలిపించింది లంకెబిందెలు వెతకడానికి, ఫాంహౌస్ల తవ్వకానికి కాదని బీఆర్ఎస్ విద్యార్థి విభాగం అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్యాదవ్ పేర్కొన్నారు. కేసీఆర్ ఫాంహౌస్ను ముట్టుకుంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. తెలంగాణ భవన్లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ ఫాంహౌస్పై దాడులు చేస్తామన్న కాంగ్రెస్ నేత మధుయాష్కీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.
ఫాంహౌస్ జోలికొస్తే చీల్చిచెండాడతామని హెచ్చరించారు. కేసీఆర్పై కాంగ్రెస్ నేతలు ఇలానే మాట్లాడితే చీల్చిచెండాడతామని పేర్కొన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్కు ప్రజలు కర్రుకాల్చి వాతపెట్టడం ఖాయమని జోస్యం చెప్పా రు. సీఎం రేవంత్ లంకెబిందెల గురిం చి మాట్లాడడం మాని పాలనపై దృష్టిపెట్టాలని సూచించారు.