హనుమకొండ, మార్చి 16 : బీఆర్ఎస్ వరంగల్ పార్లమెంట్ సభ్యుడు పసునూరి దయాకర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మంత్రి కొండా సురేఖ ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్లోని గాంధీభవన్లో పసునూరి దయాకర్కు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బొమ్మ మహేశ్కుమార్ గౌడ్ పార్టీ కండువా కప్పి కాంగ్రెస్లోకి ఆహ్వానించారు.