BRS Party | హైదరాబాద్ : రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చేసిన వాగ్దానాలను నమ్మి మోసపోయామని తెలంగాణ ప్రజలు చింతిస్తున్నారు. ఆరు గ్యారెంటీల హామీతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క హామీని కూడా సక్రమంగా అమలు చేయలేకపోయిందనేది ప్రజల్లో ఉంది. గ్రామస్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉంది. ఈ క్రమంలో కేసీఆర్ నాయకత్వాన్ని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్న పరిస్థితి నెలకొంది.
ఈ క్రమంలో తమ హక్కులను కాపాడుకోవాలంటే రాబోయే లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని ఆదరించాలని తెలంగాణ ప్రజలు నిర్ణయించుకుంటన్నట్టు సర్వేలు కూడా స్పష్టం చేస్తున్నాయి. తెలంగాణ ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా అధినేత కేసీఆర్ ప్రచార సరళిని రూపొందించనున్నారు. ఇప్పటికే జరిపిన బహిరంగ సభలకు విపరీతమైన ప్రజా స్పందన వెల్లువెత్తుతున్న నేపథ్యంలో.. తెలంగాణ ప్రజలకు మరింత చేరుకావాలని అధినేత కేసీఆర్ నిర్ణయించారు. కాంగ్రెస్ తెచ్చిన కరువుకు అల్లాడుతున్న రాష్ట్ర రైతాంగం వద్దకు వెల్లి వారి కష్ట సుఖాలను తెలుసుకోవడానికి, వారికి భరోసానివ్వడానికి రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రలు నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు. ఏప్రిల్ 18వ తేదీ గురువారం జరగనున్న ఈ సమావేశంలో అధినేత కేసీఆర్ బస్సు యాత్రకు సంబంధించిన రూట్ మ్యాప్ పై చర్చించి తుది నిర్ణయం తీసుకుంటారు.