హైదరాబాద్ : బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టోలోని హామీలు సబ్బండ వర్ణాల సంక్షేమానికి కృషి చేసేలా ఉన్నాయని ఎన్నారై బీఆర్ఎస్ బహ్రెయిన్ శాఖ అధ్యక్షుడు రాధారపు సతీష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. కేసీఆర్ విడుదలచేసిన ప్రజా మేనిఫెస్టో ఆచరణాత్మకంగా, విశ్వసనీయంగా ఉందని, కేవలం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ బిడ్డలు సైతం హర్షిస్తున్నారనిచెప్పారు.
2018 ఎన్నికల్లో ప్రకటించిన మేనిఫెస్టోలోని అంశాలన్నింటినీ వందశాతం పూర్తిచేసిన ఘనత కేసీఆర్ సర్కార్ ది మాత్రమే అని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో నేడు దేశానికే ఆదర్శమని, ఇది కేవలం రాబోయే ఎన్నికల కోసం కాకుండా భవిష్యత్తరాలకు ఉపయోగపడేలా ఉందని, కేసీఆర్ తీసుకున్న నిర్ణయం తెలంగాణ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేలా నిలిచిందన్నారు. బీఆర్ఎస్ మేనిఫెస్టోతో ప్రతిపక్షాలకు డిపాజిట్ కూడా దక్కదన్నారు.