హైదరాబాద్: మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ను, గొల్ల కురుమ జాతులను ఉద్దేశించి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీ యెగ్గే మల్లేశం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి మరీ రేవంత్రెడ్డి తీరును ఎండగట్టారు. రేవంత్రెడ్డి వ్యాఖ్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఆయన గొల్ల కురుమ జాతులను అవమానపరిచారని మండిపడ్డారు. నీతి, నిజాయితీతో బతికే మా జాతుల గురించి రేవంత్ రెడ్డి నోటికొచ్చినట్లు మాట్లాడటం విచారకరమని ఎంపీ బడుగుల అన్నారు.
రేవంత్ రెడ్డి గతంలో కూడా కుల దూరహంకారంతో మాట్లాడారని బడుగుల విమర్శించారు.
తన కులం ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడుతూ.. పాలన ఎలాగో తమ కులానికే తెలుసు అన్నట్టుగా సంకుచిత వ్యాఖ్యలు చేశాడని దుయ్యబట్టారు. రేవంత్ రెడ్డి తన నీచ రాజకీయాల కోసం కులాలను కించపరచడం తగదని హితవు పలికారు. రేవంత్ లాగా శ్రీనివాస్ యాదవ్కు నేర చరిత్ర లేదని, ఓటుకు నోటు కేసు దొంగ రేవంత్ రెడ్డి అని మండిపడ్డారు. బడుగు బలహీన వర్గాలకు కేసీఆర్ చేయూతనందిస్తే రేవంత్ రెడ్డి కించపరుస్తున్నాడని ఆరోపించారు.
జైల్లో చిప్పకూడు తిన్న రేవంత్ రెడ్డి మా జాతులను విమర్శిస్తాడా అని ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి గొల్ల కురుమలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రేవంత్ క్షమాపణ చెప్పకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని, ఆయన నోరు అదుపులో పెట్టుకోవాలని, తన బ్లాక్ మెయిలింగ్ పద్ధతిని మానుకోవాలని అన్నారు. రేవంత్రెడ్డి పీసీసీ అధ్యక్ష పదవిని డబ్బులు పెట్టి కొనుక్కున్నాడని ఆయన సొంత పార్టీవాళ్లే చెబుతున్నారని విమర్శించారు.
రేవంత్ రెడ్డి ఓ పెద్ద బ్లాక్ మెయిలర్: ఎమ్మెల్సీ యెగ్గే మల్లేశం
అని, బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు సంపాదించడం రేవంత్ ప్రవృత్తి అని ఎమ్మెల్సీ యెగ్గే మల్లేశం ఆరోపించారు. శ్రీనివాస్ యాదవ్ రాజకీయాల్లో సీనియర్ అని చూడకుండా రేవంత్ కులం పేరుతో దూషించారని, రేవంత్ తక్షణమే గొల్ల కురుమలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. శ్రీనివాస్ యాదవ్తో రేవంత్కు పోలికే లేదని ఆయన ఎద్దేవా చేశారు. గొల్ల కురుమలకు సీఎం కేసీఆర్ ఎంతో చేశారని చెప్పారు. రేవంత్ రెడ్డికి సంస్కారం లేదని, వచ్చే ఎన్నికల్లో ఆయన ఎక్కడ పోటీ చేసినా గొల్ల కురుమలు కంకణం కట్టుకుని ఓడిస్తారని అన్నారు. రేవంత్ దురహంకారానికి మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు.