BRS MLC Kavitha | తెలంగాణ గడ్డ ఉద్యమాల గడ్డ, చైతన్యవంతమైన గడ్డ అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పింక్ వేవ్ కనిపిస్తోందని అన్నారు. గురువారం జూబ్లీహిల్స్ లోని పెద్దమ్మ తల్లిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ప్రజల ఆశీర్వాదంతో బీఆర్ఎస్ చరిత్ర స్రుష్టిస్తుందన్నారు. హ్యాట్రిక్ సీఎంగా సీఎం కేసీఆర్ చరిత్ర సృష్టిస్తారని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్ రావులతోపాటు ఎమ్మెల్సీ కవిత అవిశ్రాంతంగా ప్రచారం చేశారు. నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో పార్టీ అభ్యర్థుల తరపున భారీ ఎత్తున ప్రచారంలో పాల్గొన్నారు.