జనగామ: జనగామ అసెంబ్లీ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పల్లా రాజేశ్వర్ రెడ్డి(Palla Rajeshwar Reddy) ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ మురళీ కృష్ణకు తన నామినేషన్ పత్రాలను ఆయన అందజేశారు. ఈ కార్యక్రమానికి జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, మాజీ ఎమ్మెల్సీ వెంకటేశ్వర్లు, మాజీ ఆప్కో చైర్మన్ మండల శ్రీరాములు హాజరయ్యారు.
ఇవాళ ఉదయం ఇంట్లో వేద పండితులు పల్లాకు ఆశీర్వచనం అందజేశారు. ముస్లిం,క్రైస్తవ మత పెద్దలు కూడా పల్లాను దీవించారు.
ఆ తర్వాత ర్యాలీ తీస్తూ.. పల్లా తన అనుచరులతో నామినేషన్ వేసేందుకు వెళ్లారు.
ఇవాళ రెండు సెట్ల నామినేషన్ దాఖలు చేసినట్లు పల్లా మీడియాతో తెలిపారు. బీఆర్ఎస్ పార్టీని గెలిపించిన జనగామ ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని కల్పించాలని ఆయన కోరారు.