హైదరాబాద్, జూలై 5 (నమస్తే తెలంగాణ) : గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్కు కొత్తగూడెం జిల్లా సుజాతనగర్-సీతంపేట సమీపంలో స్థలం గుర్తించడంపై బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర హర్షం వ్యక్తంచేశా రు. భద్రాద్రి జిల్లాలో ఎయిర్పోర్ట్ అవశ్యకతపై తాను పలుమార్లు పార్లమెంట్ లో ప్రస్తావించానని, కేంద్ర మంత్రులను కలిసి విజ్ఞప్తి చేసినట్టు ఆదివారం ఒక ప్రకటనలో గుర్తుచేశారు. తన వినతికి స్పం దించిన కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రాంమోహన్నాయుడు రాజ్ టెక్నాలజీస్ సంస్థకు బాధ్యతలు అప్పగించారని పేర్కొన్నారు. సదరు సంస్థ విమానాశ్రయం ఏర్పాటుకు స్థలం గుర్తించడం ఎంతో ఆనందంగా ఉన్నదని తెలిపారు.
హైదరాబాద్, జూలై 5 (నమస్తే తెలం గాణ): కన్నెపల్లి పంప్హౌస్ సందర్శనకు బయల్దేరిన కేటీఆర్ నేతృత్వంలోని బీఆర్ ఎస్ బృందాన్ని అడ్డుకోవడం దుర్మార్గమ ని బీసీ కమిషన్ మాజీ సభ్యుడు ఉపేంద్ర పేర్కొన్నారు. బీఆర్ఎస్ నేతలు కాళేశ్వరా న్ని చూసేందుకు వెళ్తే కాంగ్రెస్ సర్కార్ ఎందుకు వణికిపోతున్నదని ప్రశ్నించారు.