Swamy Goud | పార్లమెంట్ ఎన్నికల్లో బీసీలంతా ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఎంతైన ఉంది. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నత్తి కోసం ఎన్నో ఏండ్లుగా పాటుపడుతున్న ఘనత కాసాని జ్ఞానేశ్వర్కే దక్కుతుంది. బీసీలకు దమ్ముంటే, మీరు చేతనైతే జ్ఞానేశ్వర్ను గెలిపించుకోవాలని ఒక నాయకుడు సోషల్ మీడియా వేదికగా సవాల్ విసిరాడు. పండుగ సాయన్న, సర్వాయి పాపన్న, మాలోజీశ్రీ, చాకలి ఐలమ్మ, దొడ్డి కొమరయ్య లాంటి వాళ్లు మనవాళ్లే. అలాంటి వాళ్ల రక్తం మనలో పారుతలేదా. కచ్చితంగా మనమంతా ఏకతాటిపైకి రావాలి. 543 మంది పార్లమెంట్ మంది సభ్యులు ఉంటే, 80 మంది మాత్రమే బీసీ సామాజిక వర్గం ఎంపీలున్నారు. భారతదేశంలో జనాభా చూస్తే 70 శాతానికి పైగా బీసీలున్నాం. పార్లమెంట్లో చూస్తే 80 మందికి పరిమితమయ్యాము. మన ఓటు మనం వేసుకుని, మన బీసీ అభ్యర్థిని గెలిపించుకుందాం. పార్లమెంట్లో బీసీల సత్తా ఏంటో నిరూపించాల్సిన సమయం వచ్చింది. బీసీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ కోసం కారు గుర్తుకు ఓటు వేసి నిజ స్వరూపం చూపించాల్సిన అవసరం ఉంది. బీసీలందరికీ మంచి అవకాశం వచ్చింది. అవకాశాన్ని వినియోగించుకోవాలి. 16.5 లక్షల ఓట్లు బీసీ సామాజిక వర్గం ఓట్లు పార్లమెంట్లో ఉన్నాయి. బీసీలంతా బలహీనులం కాదని, బలమైన కులాలం అన్న సంగతి చాటి చెప్పాలి. బీసీ సామాజిక వర్గం అంత కూడా మన అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్గెలిపించి పార్లమెంట్కు పంపించాల్సిన అవసరం ఉంది.