బోధన్, నవంబర్ 9: బీఆర్ఎస్కు వేరే రాష్ర్టాలకు చెందిన నేతల నుంచి మద్దతు లభిస్తున్నది. మహారాష్ట్రలోని నాందెడ్ జిల్లా బిలోలి తాలూకా ఏస్గీ గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్, అక్కడి స్థానిక నాయకుడు గంగాధర్రావు ప్రచండ బుధవారం బోధన్లో ఎమ్మెల్యే మహ్మద్ షకీల్ను కలిసి బీఆర్ఎస్కు మద్దతు ప్రకటించారు. తనతో పాటు ఎంతోమంది నాయకులు బీఆర్ఎస్కు మద్దతు ఇస్తున్నారని, త్వరలో బిలోలి తాలూకాలో బీఆర్ఎస్ శాఖ ఏర్పాటు చేసేందుకు సుముఖంగా ఉన్నామని తెలిపారు.
మహారాష్ట్రలో త్వరలో జరుగనున్న మున్సిపల్ ఎన్నికల్లో సరిహద్దులోని బిలోలి, దెగ్లూర్, కొండల్వాడి మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను సీఎం కేసీఆర్ నిలబెట్టాలని కోరారు. తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న తమ గ్రామాలను వీలైతే తెలంగాణలో కలిపేందుకు సీఎం కేసీఆర్ను ఒప్పించాలని ప్రచండ ఎమ్మెల్యేను కోరారు.