హైదరాబాద్, మార్చి 1 (నమస్తే తెలంగాణ): భారత రాష్ట్ర సమితి పార్టీ సభ్యత్వం తీసుకొని ప్రమాదవశాత్తు చనిపోయిన 60 మందికి రూ.2 లక్షల చొప్పున ప్రమాద బీమా మంజూరు పత్రాలను బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ మాదిరెడ్డి శ్రీనివాస్రెడ్డి, ప్రమాద బీమా ఇన్చార్జి పార్టీ ప్రధాన కార్యదర్శి సోమా భరత్కుమార్ గుప్తా అందించారు.
బుధవారం తెలంగాణ భవన్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారికి బీమా మంజూరు పత్రాలను అందించారు. అలాగే, బుధవారం తొర్రూరు మండలానికి చెందిన బూక్య స్వామి, కాంతమ్మ, మీర్పేటకు చెందిన అనసూర్య, చంద్రయ్య ప్రమాదవశాత్తు చనిపోగా, వారి కుటుంబాలకు మంజూరు పత్రాలు ఇచ్చారు.