హైదరాబాద్, జూన్ 8 (నమస్తే తెలంగాణ): తెలంగాణ మాడల్ పాలనే ఎజెండాగా మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీ విస్తరణ కార్యక్రమాన్ని 288 నియోజకవర్గాల్లో చేపట్టాలని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ సూచించారు. ప్రతి గ్రామంలోనూ అ న్ని వర్గాల ప్రజల భాగస్వామ్యంతో 9 కమిటీలను ఏర్పాటు చేయాలని పేరొన్నారు. మహారాష్ట్ర నుంచి బీఆర్ఎస్లోకి చేరికలు ఉధృతంగా కొనసాగుతున్న నేపథ్యంలో గురువారం కూడా పలువురు మహారాష్ట్ర నుంచి వచ్చి సీఎం కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణలో రైతులు సహా అన్ని వర్గాల ప్రజలకు అందిస్తున్న సంక్షేమ మాడల్ గురించి కరపత్రాలు, బుక్లెట్స్, సోషల్ మీడియా, పోస్టర్స్, హోర్డింగ్స్ ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. మహారాష్ట్ర ప్రజలకు కూడా తెలంగాణ పథకాలు అందించాలనే స్ఫూర్తితో బీఆర్ఎస్ పని చేస్తున్నదని, అకడి రైతులు సహా అన్ని వర్గాల ప్రజలు బీఆర్ఎస్ను ఆదరిస్తున్న తీరు సంతోషకరమని తెలిపారు. తెలంగాణలో ధరణి పోర్టల్ తీసుకొచ్చి రెవెన్యూ రికార్డుల డిజిటలైజేషన్ చేపట్టామని, పది నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయి రైతులకు పారదర్శకంగా సేవలు అందిస్తున్నామని చెప్పారు. రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత విద్యుత్తు, ఉచిత సాగునీరు సహా వ్యవసాయరంగం అభివృద్ధికి అనేక చర్యలు చేపట్టి రైతులకు భరోసా కల్పిస్తున్నామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ పార్టీలో చేరిన వారిలో ప్రము ఖ సామాజిక కార్యకర్త డాక్టర్ సుభాష్ రాథోడ్, సేనాసంఘటన్ నుంచి ఉమేశ్ చవాన్, బీజేపీకి చెందిన సివిల్ ఇంజినీర్ దీపక్పవార్, భారత్పవార్, అకోలాబజార్ ఉప సర్పంచ్ అశోక్రాథోడ్, ఉపాధ్యాయ్ సంఘటన్ యవత్మాల్ జిల్లాకు చెందిన అజయ్రాథోడ్, బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు ప్రకాశ్రాథోడ్, శివసేన సరిల్ ప్రముఖుడు రాజేశ్పవార్, శివసేన షిండే వర్గానికి చెందిన పర్వీన్చవాన్ తదితరులున్నారు. కార్యక్రమంలో మహారాష్ట్ర బీఆర్ఎస్ నాయకులు శంకరన్న దోండ్గే, మాణిక్కదం, టీఎస్ఐడీసీ చైర్మన్ వేణుగోపాలాచారి, బీఆర్ఎస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి హిమాన్షు తివారీ తదితరులు పాల్గొన్నారు.