చిక్కడపల్లి, ఆగస్టు 21: ఆదిలాబాద్ సిమెంట్ పరిశ్రమను వెంటనే పునరుద్ధరించాలని పలువురు వక్తలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. తెలంగాణ అధ్యయన సమాలోచన కేంద్రం(టాస్క్) ఆధ్వర్యంలో శుక్రవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ‘సీసీఐ పునరుద్ధ్దరణ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత’ అనే అంశంపై టాస్క్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఎర్రోజు శ్రీనివాస్ అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఎమెల్సీ దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఎప్పుడూ తెలంగాణపై కక్షపూరితంగానే వ్యవహరిస్తున్నదని ఆరోపించారు. విభజన చట్టం ద్వారా వచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తున్నదని ధ్వజమెత్తారు.
మాజీ మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ 12 ఏండ్లుగా ఆదిలాబాద్ సిమెంట్ పరిశ్రమను పునరుద్ధరించడానికి నిరంతరం పనిచేస్తున్నానని తెలిపారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ మాట్లాడుతూ సిమెంట్ పరిశ్రమ పునరుద్ధరణ ఉద్యమంలో తమ పార్టీ ముందునడుస్తుందని తెలిపారు. సమావేశంలో ప్రొఫెసర్ నాగేశ్వర్, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్, రిటైర్డ్ జడ్జి జస్టిస్ చంద్రకుమార్, కారం రవీందర్రెడ్డి, ప్రొఫెసర్ రవీందర్యాదవ్, జేవీ చలపతిరావు, నందిరామయ్య, జోజిరెడ్డి, నవీన్, గుడిసె రూబీ స్టీఫెన్సన్, వెంకన్న, మాధవ్, భానుదాస్ తదితరులు పాల్గొన్నారు.