అంబర్పేట : ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై అన్ని వర్గాల ప్రజలు, బస్తీ కుటుంబాలు బీఆర్ఎస్లో చేరుతున్నారని అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్(Mla Kaleru Venkatesh) అన్నారు. బాగ్అంబర్పేట డివిజన్ సంజయ్నగర్ బస్తీకి చెందిన కుటుంబాలు ఏకగ్రీవ తీర్మానంతో ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారితో పాటు బీజేపీ నాయకులు సతీష్రెడ్డి, క్రాంతికుమార్ వారి అనుచరులు వంద మందికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. సీఎం కేసీఆర్(CM KCR) నేతృత్వంలో దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణ అభివృద్ధి(Development) చెందుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కు ముందు తాగునీరు, సాగునీరు, కరెంటు సమస్యలు అనేకం ఉండేవని గుర్తు చేశారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మిషన్ భగీరథ(Mission Baghiratha) కింద ఇంటింటికీ మంచినీరు , 24 గంటల నాణ్యమైన కరెంటు సరఫరా అందుతుందని పేర్కొన్నారు.
సంక్షేమ పథకాలు ఆసరా పింఛన్లు, కల్యాణ లక్ష్మి(Kalyana Laxmi), షాదీముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్(CM Relief Fund) వంటివి ఎన్నో అమలవుతున్నాయని తెలిపారు. నియోజకవర్గ ఎంపీ, కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి నియోజకవర్గాన్ని పట్టించుకోవడం లేదని విమర్శించారు. నాలుగేళ్లుగా తన పార్లమెంటు నియోజకవర్గానికి ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టలేదని ఆరోపించారు.
రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు సీహెచ్ చంద్రమోహన్, సీనియర్ నాయకులు జె.భాస్కర్గౌడ్, అరుణ్కుమార్రెడ్డి, శ్రీరాములుముదిరాజ్, కనివేట నర్సింగ్రావు, పి.గెల్వయ్య, రమేష్నాయక్, కోట్ల సంతోష్, అఫ్రోజ్పటేల్, బొట్టు శ్రీను, స్వామి, జమ్మిశెట్టి బాల్రాజు, శ్రీహరి, నిరంజన్, శివకుమార్గుప్తా, జహంగీర్, రాజేశ్, దిలీప్రాజ్ తదితరులు పాల్గొన్నారు.