మంచిర్యాల : జిల్లాలోని క్యాతనపల్లి ( Kyatanapalli ) మున్సిపాలిటీలో అత్యధిక స్థానాలు సాధించిన బీఆర్ఎస్(BRS ), మిత్రపక్షమైన సీపీఐ ( CPI ) నాయకులు కలసి శుక్రవారం గెలుపు సంబరాలు నిర్వహించారు. ఎన్నికల్లో మొత్తం 22 స్థానాలకు గాను బీఆర్ఎస్ 12
, మిత్ర పక్షం సీపీఐ 3, కాంగ్రెస్ 5 వార్డుల్లో గెలుపొందింది.

దీంతో బీఆర్ఎస్ మాజీ పార్లమెంట్ సభ్యుడు బాల్కసుమన్, సీపీఐ నాయకులు సంతోషం వ్యక్తం చేస్తూ పట్టణంలో సంబరాలు జరిపారు. మున్సిపాలిటీ ప్రజలు ఆశీర్వదించి గెలిపించినందుకు ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ పతనానికి మున్సిపాలిటీ ఎన్నికలు నాంది అని అన్నారు. రాబోయే రోజుల్లో కౌన్సిల్ లో మంచి పరిపాలన అందిస్తామని, కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రి ఎన్ని ప్రలోభాలకు గురిచేసిన మున్సిపల్ ప్రజలు బీఆర్ఎస్ ,సీపీఐని ఆశీర్వదించారని పేర్కొన్నారు.