హైదరాబాద్, జూన్ 29 (నమస్తే తెలంగాణ) : విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 30 అడుగుల కాంస్య విగ్రహం పశ్చిమగోదావరి జిల్లా భీమవరానికి బుధవారం చేరుకొన్నది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా అల్లూరి 125వ జయంతిని పురస్కరించుకొని జూలై 4న స్థానిక ఏఎస్ఆర్ నగర్లోని మునిసిపల్ పార్కులో ఆయన విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించనున్నారు. పాలకొల్లు మండలం ఆగర్రు గ్రామానికి చెందిన అల్లూరి సీతారామరాజు దాదాపు రూ.3కోట్ల విలువైన 15 టన్నుల అల్లూరి విగ్రహాన్ని తయారు చేయించారు.