హైదరాబాద్, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ) : భారత సంతతి బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ తల్లిదండ్రులు యశ్వీర్, ఉషా సునాక్ బుధవారం కర్నూల్ జిల్లా మంత్రాలయంలోని రాఘవేంద్ర స్వామి మఠాన్ని సందర్శించారు. వీరితో పాటు సునాక్ అత్త సుధామూర్తి కూడా మఠాన్ని సందర్శించారు.
మఠం అధికారులు సంప్రదాయం ప్రకారం స్వాగతం పలికారు. ముందుగా వీరంతా గ్రామ దేవత మంచాలమ్మను దర్శించుకొని, అనంతరం రాఘవేంద్రస్వామి మూల బృందావనాన్ని దర్శించుకొన్నారు. శ్రీమఠానికి విచ్చేసిన వీరికి మఠం పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థులు శేషవస్త్రం, రాఘవేంద్రస్వామి చిత్రపటం, ఫలమంత్ర అక్షింతలు ఇచ్చి ఆశీర్వదించారు.