సాయంత్రం కూతురి వివాహానికి ఏర్పాట్లు
ఉదయమే తండ్రి మృతి
బీర్కూర్, ఆగస్టు 2 : ఎంతో సందడిగా వివా హం జరగాల్సిన ఆ ఇంట్లో విషాదం నిండింది. సా యంత్రం కూతు రు పెండ్లి జరగాల్సి ఉండగా ఉదయమే తండ్రి మృతిచెందిన ఘటన కామారెడ్డి జిల్లా బీర్కూర్లో సోమవారం చోటుచేసుకున్నది. బీర్కూర్లోని పోచారం కాలనీకి చెందిన షేక్ గూడుమియా(50)కు ముగ్గు రు కుమార్తెలు, ఒక కొడుకు ఉన్నారు. గూడుమియా మొదటి కుమార్తెకు బాన్సువాడ మండలం దేశాయిపేట్కు చెందిన ఓ యువకుడితో వివాహం కు దిరింది. సోమవారం సాయంత్ర వివా హం జరుగాల్సి ఉన్నది. కాగా, గత నెల 29న తీవ్ర అస్వస్థతకు గురైన గూడుమియాను నిజామాబాద్లోని ఓ ప్రైవేటు దవాఖానకు తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం ఉద యం ఆయన మృతి చెందాడు. సాయంత్రం కూతురు పెండ్లి జరిపించాల్సిన ఇంట్లో తండ్రి మరణించడం ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. కాగా, గూడుమియా ఉపా ధి కోసం 14 ఏండ్లు దుబాయ్లో ఉండి రెండేండ్ల క్రితమే వచ్చాడు.