మంచిర్యాల ఏసీసీ/ నెన్నెల, డిసెంబర్ 17 : అప్పుడే పుట్టిన బాబులో చలనం లేకపోవడంతో సీపీఆర్ ద్వారా బతికించారు 108 సిబ్బంది. వివరాలిలా.. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లికి చెందిన కుమ్మరి పద్మకు శనివారం తెల్లవారుజామున పురిటి నొప్పులు రావడంతో కాగజ్నగర్ దవాఖానకు తీసుకొచ్చా రు. అక్కడ పరీక్షించిన వైద్యులు కాన్పు కష్టమని, మంచిర్యాల ప్రభుత్వ దవాఖానకు రెఫర్ చేశారు. 108 అంబులెన్స్లో బెల్లంపల్లి వరకు తీసు కొచ్చారు. బెల్లంపల్లిలో నెన్నెల వద్ద 108 వాహ నంలోకి పద్మను తీసుకెళ్లారు. అప్పటికే పద్మ పురిటి నొప్పులతో తల్లడిల్లుతున్నది.
తల్లీబిడ్డకు ప్రమాదమని గమనించిన ఈఎంటీ పిల్లి రమేశ్, పైలెట్ రాజేశం మందమర్రి వద్ద మార్గంమధ్యలో వాహనంలోనే పురుడు పోశారు. మగ బిడ్డకు జన్మనిచ్చింది. కొద్దిసేపటి వరకు శిశువులో చలనం లేకపోవడంతో సీపీఆర్ చేశారు. దీంతో శిశువు ఏడ్వడం ప్రారంభించాడు. వెంటనే మంచిర్యాల ప్రభుత్వ దవాఖానకు తరలించారు. తల్లీబిడ్డను బతికించిన 108 సిబ్బందికి పద్మ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.