హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): గ్రామీణ తపాలా ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చిన్న ఉద్యోగులపై మోదీ సర్కారు తీరు సరికాదని పేర్కొన్నారు.
శుక్రవారం హైదరాబాద్లోని మంత్రు ల నివాసంలో వినోద్కుమార్ను గ్రామీణ తపాలా ఉద్యోగుల సంఘం జాతీయ నేత వెంకటేశ్వర్లు, రైల్వే ఉద్యోగుల సంఘం నేత యాదవరెడ్డి కలిశారు. నవంబర్ 19 నుంచి మూడు రోజులపాటు హనుమకొండలో జరిగే జాతీయస్థాయి మహాసభకు హాజరు కావాలని వినోద్కుమార్ను వారు ఆహ్వానించారు.