మహబూబ్నగర్, ఆగస్టు 25 : మహబూబ్నగర్లోని సుశృత ప్రజావైద్యశాల వ్యవస్థాపకురాలు డాక్టర్ ప్రతిభారెడ్డి మాతృమూర్తి, మాజీ రాజ్యసభ సభ్యుడు, సీపీఎం జాతీయ నేత మధు జీవనసహచరి సుమంతమ్మ భౌతికాయాన్ని పాలమూరు ప్రభుత్వ మెడికల్ కళాశాలకు అందజేశారు.
ప్రతిభ మాతృమూర్తి సుమంతమ్మ(65) మంగళవారం ఉదయం అనారోగ్యం తో మృతిచెందారు. సాయంత్రం మ హబూబ్నగర్ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో సుమంతమ్మ భౌతికకాయం వద్ద వైద్య విద్యార్థులు, వైద్యులు, ప్ర ముఖులు నివాళులర్పించారు.