హైదరాబాద్, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ): ఆధునిక నోస్ట్రాడమస్గా పిలువబడే బల్గేరియన్ ఆధ్యాత్మికవేత్త బాబా వంగా 2024కు సంబంధించి గతంలో చెప్పిన భవిష్యవాణి నిజమౌతున్నదని సోషల్మీడియాలో నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. వంగా అంచనా వేసినట్టే క్యాన్సర్కు వ్యాక్సిన్ను త్వరలో అభివృద్ధి చేయనున్నట్టు రష్యా అధ్యక్షుడు పుతిన్ చేసిన ప్రకటనను ఇందుకు ఉదహరిస్తున్నారు. అలాగే, బ్రిటన్లో ఆర్థిక సంక్షోభం కొనసాగుతుండటం, అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ర్యాంకుల్లో జపాన్ నాలుగో స్థానానికి పరిమితమవ్వడం వంటి అంశాలను కూడా ఉటంకిస్తున్నారు. ఇవన్నీ, గతంలోనే వంగా భవిష్యవాణిలో ఊహించినట్టు పేర్కొంటున్నారు.
అయితే, 2024లో జరుగబోయే మరికొన్ని విపత్తులు, విషాదాల గురించి కూడా వంగా తన భవిష్యవాణిలో ముందుగానే అంచనా వేశారు. ఇప్పుడు అవి కూడా నిజమౌతాయా? అనే చర్చ పెద్దయెత్తున జరుగుతున్నది. కాగా వంగా గతంలో అంచనా వేసిన విధంగానే ట్విన్ టవర్ ఎటాక్స్, ప్రిన్సెస్ డయానా మృతి, చర్నోబిల్ ఉదంతం, బ్రెగ్జిట్ వ్యవహారం నిజంగానే జరుగడం తెలిసిందే.