ఖమ్మం, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ప్రజలను మత విభజన చేసి, విద్వేషాలను రెచ్చగొట్టి బీజేపీ గుజరాత్ ఎన్నికల్లో గెలిచిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. శుక్రవారం ఖమ్మంలో వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఎలక్షన్ బాండ్ విధానం పేరుతో బీజేపీ నాయకులు భారీగా డబ్బు వసూలు చేసి ఎన్నికల్లో ఖర్చు పెట్టారని విమర్శించారు. కానీ హిమాచల్ప్రదేశ్లో వారి పాచికలు పారలేదని అన్నారు. ఈనెల 29 నుంచి ఖమ్మంలో నిర్వహించే వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని కోరారు.