చండూర్, ఆగస్టు 22: తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్లోకి వరుస కడుతున్నారని విద్యుత్తుశాఖ మంత్రి జీ జగదీశ్రెడ్డి పేర్కొన్నారు. నల్లగొండ జిల్లా చండూర్ మండలంలోని దోనిపాముల ఎంపీటీసీ, బీజేపీకి చెందిన తిప్పర్తి లక్ష్మమ్మ ఆమె కుమారుడు నరేశ్ సోమవారం హైదరాబాద్లో మంత్రి జగదీశ్రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. వీరికి మంత్రి గులాబీ కండువాలు కప్పి టీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. మంత్రి మాట్లాడుతూ.. కార్యకర్తలకు టీఆర్ఎస్ పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో చండూర్ జడ్పీటీసీ కర్నాటి వెంకటేశం, ఎంపీటీసీ అవ్వారి గీతాశ్రీనివాసులు, టీఆర్ఎస్ నాయకులు బండారు చంద్రయ్య పాల్గొన్నారు.