నల్లగొండ : మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ సమయం దగ్గర పడుతున్న కొద్ది బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి. రాజగోపాల్ రెడ్డి శిష్యులు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి, అయితగోని విజయ్ షాకిచ్చారు. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి ఆధ్వర్యంలో గోవర్ధన్ రెడ్డి, విజయ్ టీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి మంత్రి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వేమిరెడ్డి నరసింహారెడ్డి, సూర్యాపేట జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గోపగాని వెంకట్ నారాయణ గౌడ్ పాల్గొన్నారు.
ఇక ఆరు నెలల క్రితం బీజేపీలో చేరిన ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ ఆ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు భిక్షమయ్య గౌడ్ బహిరంగ లేఖ విడుదల చేశారు. బీజేపీ పార్టీ బీసీలకు తీవ్ర అన్యాయం చేస్తుందని ఆయన ధ్వజమెత్తారు. తెలంగాణకు రూపాయి సాయం కూడా చేయలేదని మండిపడ్డారు.