కరీంనగర్, జూలై 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/హుజూరాబాద్ టౌన్: అంబేద్కర్ విగ్రహం సాక్షిగా హుజూరాబాద్లో బీజేపీ నాయకులు దళితులపై దాడి చేశారు. ఈటల బామ్మర్ది మధుసూదన్రెడ్డి దళితులను కించపరిచేలా చేసిన వాట్సాప్ చాట్ను నిరసిస్తూ శాంతియుతంగా ఆందోళన చేస్తున్న దళితులను అడ్డుకొని చెప్పులు విసిరేసి రెచ్చగొట్టడమే కాకుండా పిడిగుద్దులతో దాడిచేశారు. చంపేస్తామంటూ బెదిరింపులకు దిగారు. పోలీసులు రంగప్రవేశం చేయడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఈ అమానుష దాడి జరుగుతున్నంత సేపూ బీజేపీ నేత ఈటల రాజేందర్ భార్య జమున అక్కడే ఉన్నారు. దాడిని అడ్డుకోవడానికి ఎంతమాత్రం ప్రయత్నించలేదు. బీజేపీ నేతల దాడిపై దళిత సమాజం భగ్గుమన్నది.
ఈటల బామ్మ ర్ది కొండవీటి మధుసూదన్రెడ్డి దళితులను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన చాట్ సోషల్ మీడియాలో వైరల్గా మారిన విషయంతెలిసిందే. చాట్లో మధుసూదన్రెడ్డి దళితులను తిట్టడం, కించపరచడం, అవమానకర భాష వాడటం, చట్టరీత్యా నేరం. ఇవన్నీ తెలిసి కూడా మధుసూదన్రెడ్డి తన వాట్సాప్ చాట్ లో దళితులను తూలనాడారు. చాట్ వివరాలతోపాటు దళితబంధు పథకాన్ని ఆపేందు కు కేంద్ర ఎన్నికల సంఘానికి చేసిన ఫిర్యాదులపై ‘దళిత సోదరుల వెన్నులో ఈటలు!’ ‘దళిత బంధును ఆపే కుట్ర’ శీర్షికలతో ‘నమస్తే తెలంగాణ’ గురువారం బహిర్గతంచేసింది. ఈ కథనాలు సంచలనం రేపాయి. దళితబంధును ఆపే కుట్రలపై దళిత సమా జం భగ్గుమన్నది. హుజూరాబాద్లోనే కాదు.. ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా మధుసూదన్రెడ్డితోపాటు ఈటల దిష్టిబొమ్మలను దహనం చేశారు. శవయాత్రలు నిర్వహించి బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ క్రమంలోనే హుజూరాబాద్ మ ధుసూదన్రెడ్డిపై పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు బ్యానర్ పట్టుకొని శాంతియుతం గా గాంధీనగర్ నుంచి పలువురు దళితులు ర్యాలీగా బయల్దేరారు. ఇదే సమయంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ఈటల బామ్మర్ది మధుసూదన్రెడ్డి, ఈటల సతీమణి జమునారెడ్డి ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పాలతో అభిషేకం చేసేందుకు అక్కడి కి వచ్చారు. దళిత యువకుల ర్యాలీని చూసి సీఎం కేసీఆర్కు వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తలు నినాదాలుచేశారు. అదేపనిగా నినాదాలు ఇవ్వడంతో వారి తీరుపై ఆగ్రహించిన దళిత యువకులు ఈటలకు వ్యతిరేకంగా నినదించారు. అట్లా నిరసిస్తూనే పోలీస్స్టేషన్కు వెళ్లే ప్రయత్నం చేశారు. అక్కడే ఉన్న పోలీసులు ఇరువురు ఎదురెదురు పడకుం డా జాగ్రత్తలు తీసుకొంటున్న సమయంలోనే బీజేపీ కార్యకర్తలు దళితులపై చెప్పులు విసిరివేశారు. దళితులపై దాడిచేసేందుకు ముందుకు దూసుకొచ్చారు. ‘తన్నండి ఒక్కొక్కడిని’ అంటూ అరుస్తూ ఉరికొచ్చారు.
ఆ పేందుకు ప్రయత్నించిన పోలీసులను కూడా పక్కకు నెట్టివేస్తూ దూసుకెళ్లి దళితులపై దాడికి దిగారు. అక్కడే ఉన్న ఈటల భార్య జమునారెడ్డి, బామ్మర్ది మధుసూదన్రెడ్డి కనీసం ఆపేందుకు ప్రయత్నం చేయకపోగా, రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించారు. బీజేపీ కార్యకర్తలు బరితెగించి దళిత యువకులపై మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు. అక్కడే ఉన్న పోలీసులు ఆపకపోతే దళితుల ప్రాణానికి హాని కలిగేదని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ సంఘటనపై ఇరువర్గాలు పోలీస్స్టేషన్లో పరస్పరం ఫిర్యాదుచేసుకొన్నాయి. తమపై దాడి చేసిన బీజేపీ నాయకులు, కార్యకర్తలను శిక్షించాలని పోలీస్స్టేషన్ ముందు దళిత యువకులు నిరసనకు దిగారు. అనంతరం సీఐకి వినతిపత్రం అందజేశారు.
ఒక్కసారిగా మీద పడ్డారు
మేము ర్యాలీగా పోలీస్స్టేషన్ వైపు వస్తుండగా బీజేపీ కార్యకర్తలు ఒక్కసారిగా విరుచుకుపడ్డా రు. పిడిగుద్దులు గుద్దు తూ అంగీలు చించి చెప్పులు విసిరారు. పోలీసులు తక్షణమే స్పందించి అడ్డుకోకపోతే చంపేందుకు కూడా వెనుకాడేవారు కాదు. అక్కడే ఉన్న ఈటల జమున వారిని శాంతింపజేయకుండా రెచ్చగొట్టేలా ప్రవర్తించడం చాలా బాధ కలిగించింది.
వీధి గుండాల్లా వ్యవహరించారు
దళితులను కించపరిచేలా మాట్లాడిన ఈటల బామ్మార్ది మధుసూదన్రెడ్డి తీరును నిరసిస్తూ శాంతియుతంగా ర్యాలీగా వస్తున్న మాపై కొందరు బీజేపీ నాయకులు బజారు గూండాల్లా మారి విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డారు. మాపై కక్షపూరితంగా వ్యవహరించారు. అకారణంగా దాడికి పాల్పడిన వారిని అరెస్టు చేయాలి.