హైదరాబాద్, జూలై 4 (నమస్తే తెలంగాణ): ఈటల రాజేందర్కు ఎన్నికల ప్రచార కమిటీ బాధ్యతలు అప్పగించడంపై బీజేపీలో కొందరు సీనియర్ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. ముఖ్యం గా విజయశాంతి గుర్రుగా ఉన్నట్టు సమాచారం. ఉద్యమ నాయకుడం టూ ఈటలకు పదవి కట్టబెట్టిన పెద్దలకు.. తాను కూడా ఉద్యమం నుంచే వచ్చిన విషయం ఎందుకు మర్చిపోయారంటూ గరమైనట్టు తెలుస్తున్నది.
చాలారోజులుగా తాను పదవి కావాలని, తన సేవలను పార్టీ వినియోగించుకోవాలని కోరుతున్నా పట్టించుకోవడం లేదని, ఇప్పుడు కూడా అన్యాయమే జరిగిందని సన్నిహితుల వద్ద వాపోయినట్టు సమాచారం. మరికొందరు సీనియర్ నేతలు సైతం ఏండ్లుగా విధేయులుగా ఉన్న తమకు సరైన గుర్తింపు ఇవ్వకుండా, అధిష్ఠానాన్ని బెదిరించినవారికి పదవులు కట్టబెట్టడం ఏమిటని మండిపడుతున్నట్టు తెలిసింది. కొన్నాళ్లుగా ఈటల వెంట తిరిగిన కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి మంగళవారం యూటర్న్ తీసుకొన్నా రు. ఆయన కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్రెడ్డితో భేటీ అయినట్టు సమాచారం. కాంగ్రెస్లో చేరాలని ఆహ్వానించగా ‘పరిశీలిస్తా’ అని చెప్పినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.