హైదరాబాద్, మార్చి 28 (నమస్తే తెలంగాణ): మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా పరిధిలో ఇటీవల జరిగిన చెంగిచెర్ల దాడి ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సోలంకి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ఘటనలో రాష్ట్ర ప్రభుత్వం కంటితుడుపు చర్యలు చేపట్టిందని, బుజ్జగింపు రాజకీయాలు చేస్తున్నదని మండిపడ్డారు. నిందితులందరినీ గుర్తించి, వారిపై కఠిన చట్టాలు ప్రయోగించాలని కోరారు.
మహిళలు, గర్భిణులు, వృద్ధులపై 300 మంది దాడి చేస్తే కేవలం ఐదుగురిని మాత్రమే అరెస్ట్ చేసిందని విమర్శించారు. బాధితులకు సా యం అందించాలని కోరారు. బీజేపీ పాలిత రాష్ర్టా ల్లో చిన్న ఘటన జరిగినా కాంగ్రెస్ అగ్రనేతలైన రాహుల్గాంధీ, ప్రియాంకగాంధీ చార్టెడ్ ఫె్లైట్లో వెళ్తుంటారని, చెంగిచెర్లకు రావడానికి మా త్రం వారికి మనసొప్పడం లేదని ఎద్దేవా చేశారు. చెంగిచెర్లలో ప్రభుత్వం ఇంకా కేటాయించని డబుల్ బెడ్రూం ఇండ్లను కొందరు ఆక్రమించుకొని నివాసం ఉంటున్నారని, వారిని ఖాళీ చేయించాలని కోరారు.