హైదరాబాద్, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ): మహిళలు, సామాన్యులపై బీజేపీ గూండాలు దాడి చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. కమలం నాయకుల దౌర్జన్యకాండపై నెటిజన్లు నిరసన వ్యక్తంచేశారు. ఫలితంగా #బీజేపీగూండాస్ హ్యాష్ట్యాగ్ బుధవారం జాతీయస్థాయిలో టాప్ ట్రెండింగ్లో నిలిచింది. అదే హ్యాష్ట్యాగ్తో 55 వేలకు పైగా ట్వీట్లు వెల్లువెత్తాయి. జనగామ జిల్లాలో ఎంపీ బండి సంజయ్ పాదయాత్ర సందర్భంగా మహిళలు, సామాన్యులపై బీజేపీ గూండాలు దౌర్జన్యకాండ సాగించారు.
దాడికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీశాయి. సామాన్యులపై దాడిని ట్వి ట్టర్ వేదికగా ప్రశ్నించిన ప్రజలు.. బీజేపీ నాయకుల తీరుపై ఆగ్రహం వ్యక్తంచేశారు. బీజేపీ అంటేనే బట్టేబాజ్ జుగుప్సాకర పార్టీ అని, ఇలాంటి హింసలు తప్ప అభివృద్ధి గు రించి వారు ఆలోచించరని ట్విట్టర్లో ఓ వ్యక్తి స్పందించారు. బీజేపీ ఉన్నచోట హిం స, అశాంతి ఉంటాయని.. బీజేపీ లేనిచోట అభివృద్ధి పుంజుకుంటుందని మరొకరు వ్యాఖ్యానించారు. బీజేపీ నేతలు రాజకీయ నాయకుల్లా కాకుండా కిరాయి గూండాల్లా వ్యవహరిస్తున్నారని మరొకరు ట్వీట్ చేశారు. అమాయక ప్రజలు ఏం పాపం చేశారని వారిపై బీజేపీ నాయకులు దాడి చేస్తున్నారంటూ ఓ మహిళ ప్రశ్నించారు.