కలెక్టరేట్, జనవరి 3: భారత దేశాన్ని మతోన్మాద దేశంగా మారుస్తున్న బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగంలోని పీఠిక నుంచి సెక్యులరిజం, సోషలిజం పదా లు మాయమవుతాయని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం దేశంలో కుహనా దేశభక్తులు ప్రమాదకరంగా మారారని, అలాంటి శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు.నిరంతరం మానవజాతి సమస్యలపై స్పందించే గొప్ప విధానమే కమ్యూనిజమని, మానవజాతిని దోపిడీ నుం చి విముక్తి చేసే గొప్ప సిద్ధాంతమే మార్క్సిజం అని పేర్కొన్నారు.
మంగళవారం సిరిసిల్ల పట్టణంలో జరిగిన తెలంగాణ సా యుధ పోరాట యోధుడు, కరీంనగర్ జిల్లా మొదటి పార్లమెంటు సభ్యుడు బద్దం ఎల్లారెడ్డి 44వ వర్ధం తి సభలో ఆయన మాట్లాడారు. ఎవరికైనా అధికారం ముఖ్యం కాదని, వ్యవస్థ ధ్వంసం కావొద్దని సూచించారు. ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నదన్నారు. ముఖ్యంగా బీజేపీ అనుసరిస్తున్న విధానాలు దేశానికి ప్రమాదకరంగా మారాయని ఆందోళన వ్యక్తం చేశారు. భిన్న మతాలు, భిన్న సం స్కృతులు ఉన్న భారతదేశంలో కులాలు, మ తాల పేర, దేశభక్తి పేర విభజించు.. పాలించు అన్న పద్ధతిని బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నదని మండిపడ్డారు.
దేశ సంపదను అప్పనంగా అంబానీ, అదానీలకు అప్పగిస్తున్నదని విమర్శించారు. ఇలాం టి పరిస్థితుల్లో రానున్న రోజుల్లో నయాభారత్ నిర్మాణం కోసం అడుగులు వేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని పిలుపునిచ్చారు. సభలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి, మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, ప్రజాగాయకురాలు విమలక్క, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య పాల్గొన్నారు.