యాదాద్రి భువనగిరి : బాధ్యత గల హోదాల ఉండి ఇష్టానుసారంగా మాట్లాడుతున్న రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Minister Komatireddy) ని మంత్రి పదవి నుంచి తొలగించాలని జెడ్పీ వైస్ చైర్మన్ బిక్కు నాయక్ అన్నారు. భువనగిరిBhuvanagiri) జిల్లా పరిషత్ కార్యాలయంలో జెడ్పీటీసీలతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా బిక్కు నాయక్ మాట్లాడుతూ.. జెడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డిపై మంత్రి కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరమని అన్నారు. ఇలాంటి మంత్రిని మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. అధికారం వచ్చి రెండు నెలల గడవకముందే రౌడీల్లా వ్యవహరిస్తూ రైతులను, ప్రజాప్రతినిధులను చులకనగా చూడటం దారుణమన్నారు. ప్రజాగ్రహానికి గురైతే ఎంతటి వారి కైనా పతనం తప్పదని హెచ్చరించారు.
కాగా, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Minister Komatireddy) నిరంకుశ వైఖరిపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. యాదాద్రి భువనగిరి జెడ్పీ చైర్మన్ సందీప్రెడ్డిపై కాంగ్రెస్ గుండాలు చేసిన దాడిపై ప్రజలు, బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నారు. మంగళవారం ఎక్కడిక్కడ మంత్రి దిష్టి బొమ్మలను(Burning effigy) తగులబెట్టి ఆందోళన చేపట్టారు.