Srisailam | శ్రీశైలం : శ్రీశైలం శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్లను బీహార్ రాష్ర్టానికి చెందిన 19 మంది ఎమ్మెల్యేలు దర్శించుకున్నారు. బుధవారం శ్రీశైల క్షేత్రం చేరుకున్న వీరికి అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ ఆధ్వర్యంలో ఏఈవో మోహన్, వేదపండితులు, అర్చకులు ఆలయ మర్యాదలతో తిలకధారణ చేసి ఘన స్వాగతం పలికారు.
అనంతరం స్వామివారి గర్బాలయంలో పంచామృత అభిషేకములు, బిల్వార్చన చేసుకుని అమ్మవారి ఆలయంలో కుంకుమార్చన చేసుకుని హారతులు అందుకున్నారు. ఆలయంలోని పరివార దేవతలను దర్శించుకున్న తర్వాత ప్రాకార మండపంలో వేదాశీర్వచనాలు వల్లించిన ప్రధానార్చకులు అభిషేక జల తీర్థప్రసాదాలు మరియు స్వామిఅమ్మవార్ల ఙ్ఞాపికను అందజేశారు. హైదరాబద్లో గత మూడు రోజులుగా జరుగుతున్న ప్రత్యేక శిబిరానికి హాజరైన బీహార్ ఎమ్మెల్యేలకు ఎమ్మెల్యే వంశీకృష్ణ ఏర్పాట్లను పరిశీంచారు.