Jalagam Venkat Rao | హైదరాబాద్, మార్చి 24 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలకు బీజేపీ చివరి జాబితాను విడుదల చేసింది. వరంగల్ ఎంపీ అభ్యర్థిగా అరూరి రమేశ్, ఖమ్మం అభ్యర్థిగా తాండ్ర వినోద్రావును ఆదివారం ప్రకటించింది. ఖమ్మం నుంచి టికెట్ ఆశించి బీజేపీలో చేరిన జలగం వెంకట్రావుకు పార్టీ అధిష్ఠానం షాక్ ఇచ్చింది. మొదట్లో జలగం వెంకట్రావుకు టికెట్ ఇస్తారని పార్టీవర్గాలు తెలిపాయి. ఆయన కూడా ప్రచారం మొదలుపెట్టారు.
కానీ, బీజేపీ మరొకరి కోసం వెదుకుతున్నదని ప్రచారం మొదలైంది. దీంతో వెంకట్రావు తరుచూ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి, ఇతర పెద్దలను కలిసి విజ్ఞప్తి చేశారు. అలాగే టీడీపీతో పొత్తు పెట్టుకొని, ఖమ్మం టికెట్ను ఇస్తారనే ప్రచారం సాగింది. అనూహ్యంగా వినోద్రావు పేరును బీజేపీ పెద్దలు ఖరారు చేశారు. దీంతో జలగం కార్యాచరణ ఏమిటనేది ఆసక్తికరంగామారింది.