హైదరాబాద్, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ) : స్టేట్ టీచర్స్ యూనియన్ తెలంగాణ స్టేట్ (ఎస్టీయూటీఎస్ ) మహబూబ్నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బీ భుజంగరావు పేరును ఖరారు చేశారు. ఆదివారం హైదరాబాద్లో నిర్వహించిన రాష్ట్రస్థాయి విస్తృత సమావేశంలో ఈ నిర్ణయం తీసుకొన్నట్టు ఎస్టీయూటీఎస్ అధ్యక్షుడు జీ సదానందగౌడ్, ప్రధానకార్యదర్శి యం పర్వత్రెడ్డి ప్రకటించారు. భుజంగరావు 16 ఏండ్ల పాటు ఎస్టీయూలో వివిధ హోదాల్లో పనిచేశారు.