హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 17 (నమస్తే తెలంగాణ): భారత్ గౌరవ్ రైళ్లలో నిరుడు 96 వేల మంది భక్తులు ప్రయాణం సాగించినట్టు బుధవారం రైల్వే అధికారులు వెళ్లడించారు. 172 పర్యాటక ట్రిప్పులతో వారంతా 24 రాష్ర్టాల్లోని ఆధ్యాత్మిక, పర్యాటక ప్రదేశాలను సందర్శించారని పేర్కొన్నారు.
అయోధ్య నుంచి జనక్పూర్, శ్రీరామ్ జానకి యాత్ర, జగన్నాథ్యాత్ర, గర్వి గుజరాత్ తదితర పర్యాటక ప్రాంతాలతోపాటు అంబేద్కర్ సర్క్యూట్, నార్త్ ఈస్ట్ టూర్ వంటి ప్రధాన టూరిస్ట్ సర్క్యూట్లను భారత్ గౌరవ రైళ్లు చుట్టి వచ్చినట్టు తెలిపారు. ఈ యాత్రకు సంబంధించిన పూర్తి వివరాలు ఐఆర్సీటీసీ అధికారిక వెబ్సైట్లో పొందుపరిచినట్టు రైల్వే అధికారులు పేర్కొన్నారు.